కౌముది లో ప్రచురితమైన నా కవిత..
మల్లెల సుగంధాలు, జాజుల సౌరభాలు,
సంపెంగల గుభాళింపు చుట్టిముట్టి..
అలుపెరుగని కోర్కెల ఝరి..
ఉవ్వెత్తున ఎగసిపడుతూ,
ఫాల బిందువులు నాసికాగ్రపు ముక్కెరకు మెరుపు నిచ్చి,
జారనీయని ఎద పయ్యెద భారంగా,
ఎదురుచూపులు బాణాల్లా గుచ్చుతుంటే....
వెన్నంటే తలపులు నీ కర స్పర్శకై,
ఎర్రబడిన కనుదోయి నీ మంగళ రూపానికై,
ఆశల అలజడి నీ అడుగుల సవ్వడికై.
ఆత్మీయతా పవనాలు మోసుకొచ్చే నీ పిలుపుకై
నిరీక్షణలో నీ అభిసారిక..